
“భ్రమయుగం” సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ మరో ప్రత్యేకమైన చిత్రం డైస్ ఈరే తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రణవ్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానుంది. డైస్ ఈరే డిసెంబర్ 05, 2025న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రణవ్ మోహన్లాల్, షైన్ టామ్ చాకో, సుష్మిత భట్, గిబిన్ గోపీనాథ్, సైజు కురుప్ తదితరులు నటించారు.
రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రఫీ అందించగా, క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చారు. చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర & ఎస్. సశికాంత్ నిర్మించారు.
