
‘దసరా’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ చిత్రం తెలుగులో విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల కేవలం కన్నడ భాషలో మాత్రమే థియేటర్లలోకి వచ్చింది.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ రిలీజ్కు సిద్ధమైంది. జనవరి 12, 2025 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి సరసన బ్రిందా ఆచార్య కీలక పాత్రలో నటించగా, గోపాల్ కృష్ణ దేశ్పాండే, సాధు కోకిల, శృతి హరిహరన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు అభిషేక్ ఎం. దర్శకత్వం వహించగా, జూడా సంధ్య సంగీతాన్ని అందించారు. అభిషేక్ జి. కాసరగోడ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, శ్రీదేవి ఎంటర్టైనర్స్ బ్యానర్పై హెచ్.కే. ప్రకాశ్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మించారు.
